Published On:

Covid-19: భయపెడుతున్న కరోనా.. 44 కి మృతుల సంఖ్య

Covid-19: భయపెడుతున్న కరోనా.. 44 కి మృతుల సంఖ్య

Corona Virus: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన కలుగుతోంది. రోజురోజుకు యాక్టీవ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఇవాళ మరో 276 మందికి కరోనా వైరస్ సోకింగి. దీంతో దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 4,302 కి చేరింది.

 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 276 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళ 1373 ఉంది. తర్వాత మహారాష్ట్ర 510, గుజరాత్ 461, ఢిల్లీ 457, కర్ణాటక 324, తమిళనాడు 216, ఉత్తరప్రదేశ్ 201 పాజిటీవ్ కేసులు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కొంత తక్కువగా ఉంది. గత 24 గంటల్లో వైరస్ బారినపడి ఏడుగురు మరణించారు. మహారాష్ట్రలో నలుగురు, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 44 కి పెరిగింది. కాగా వైరస్ వ్యాప్తి పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. మరోవైపు కరోనా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు.