Published On:

Kishan Reddy: తెలంగాణలో వేగంగా రైల్వేల అభివృద్ధి.. రూ. 80 వేల కోట్లతో పనులు

Kishan Reddy: తెలంగాణలో వేగంగా రైల్వేల అభివృద్ధి.. రూ. 80 వేల కోట్లతో పనులు

Kishan Reddy inaugurates Begumpet Railway Station: తెలంగాణలో రైల్వేల అభివృద్ధి వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 103 రైల్వేస్టేషన్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్ల ప్రారంభించారు. రాష్ట్రంలో రూ. 80 వేల కోట్లతో రైల్వే అభివృద్ధి పనులకు ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా నిర్వహిస్తున్నామన్నారు.

 

బేగంపేట రైల్వేస్టేషన్ ను సందర్శించారు. ఎంఎంటీఎస్ రెండో ఫేస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని, అలాగే యాదగిరిగుట్టకు కూడా త్వరలోనే ఎంఎంటీఎస్ పనులు మొదలు పెడతామని చెప్పారు. దసరా నాటికి కొమురవెళ్లి రైల్వేస్టేషన్ ను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని స్పష్టం చేశారు. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు ప్రధాని మోదీ స్వయంగా భూమి చేశారని గుర్తు చేశారు .తెలంగాణ రైల్వేల అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ చిత్తశుద్ధితో ఉన్నారని, రాబోయే నాలుగేళ్లలో విప్లవాత్మక కార్యకలాపాలు చేసి చూపిస్తామన్నారు.

 

కాగా రాష్ట్రంలోని అనేక రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనుల్లో భూసేకరణ సమస్యగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా భూసేకరణ చేసి కేంద్రానికి అప్పగించాలని కిషన్ రెడ్డి కోరారు. దేశవ్యాప్తంగా 1300 రైల్వేస్టేషన్లను డెవలప్ చేయాలని కేంద్రం సంకల్పించిందని.. 2026లో 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తామని వివరించారు. బేగంపేట రైల్వేస్టేషన్ ను అన్ని విభాగాలను మహిళలతో నడిపిస్తున్నట్టు ప్రకటించారు.