Last Updated:

Bandi Sanjay : డీలిమిటేషన్‌పై కలిసిన వారంతా దొంగల ముఠా.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay : డీలిమిటేషన్‌పై కలిసిన వారంతా దొంగల ముఠా.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay : గత పదేళ్లలో తెలంగాణలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని చెప్పారు. ప్రస్తుతం వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో సమీక్షలు, సర్వేలు, నివేదికల పేరుతో కాలం గడిపారన్నారు. సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.

 

 

డీలిమిటేషన్‌పై కలిసిన వారంతా దొంగల ముఠానే అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే అన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ సహకరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో కలిసి ఉంటారని, గల్లీలో కొట్లాడుకుంటారని దుయ్యబట్టారు. డీఎంకే భేటీకి రెండు పార్టీలు వెళ్లాయంటే, ఇద్దరూ ఒక్కటా? కాదా? అని ప్రశ్నించారు. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక్క నోటీసు కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడుతున్నారని తెలిపారు.

 

 

డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదన్నారు. ఆరు గ్యారంటీల హామీల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. తమిళనాడులో డీఎంకే రూ.వెయ్యి కోట్ల మద్యం కుంభకోసం చేసిందని ఆరోపించారు. డీఎంకేను సాగనంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు పక్కా ప్రణాళికతో ఇందతా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గించబోమని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ చెప్పారని గుర్తుచేశారు. డీలిమటేషన్‌కు ఎలాంటి నియమ నిబంధనలు పెట్టలేదని చెప్పారు. చెన్నైలో జరిగేది మాఫియా ముఠాల సమావేశమని ఆరోపించారు. అవినీతి,స్కామ్ పార్టీలు కలిసి బీజేపీని అప్రతిష్ఠ పాలు చేసేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి: