CM Revanth Reddy: రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు: సీఎం రేవంత్రెడ్డి!

Telangana CM Revanth Reddy presents Gurukul Awards: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్రామ్ భవన్లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ సర్కారేనని పేర్కొన్నారు.
చదువుతోనే ఏదైన సాధ్యం..
చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని, చదువు మాత్రమేనని స్పష్టం చేశారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోఠిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని గుర్తుచేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని చెప్పారు. విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు కూడా బాగుండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు చదువులు వద్దు.. కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారని తెలిపారు.
దళితులు, బీసీలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించార్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. కేసీఆర్ తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కానీ, తెలంగాణలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. తన ఇంట్లో వాళ్లు ఓ చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో 55వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉందన్నారు. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగాల భర్తీ జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలని సూచించారు. నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్నెల్లు విరామం లేకుండా వాళ్ల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులకు మాత్రం ఏళ్ల తరబడి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారని సీఎం విమర్శించారు.