Published On:

Rains in Telangana: మారిన వాతావరణం.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

Rains in Telangana: మారిన వాతావరణం.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

2 Dyas Heavy Rains in Telangana: తెలంగాణలో వచ్చే రెండు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు మద్య అరేబియా సముద్రంపై ఉపరితల ఆవర్తనం, అలాగే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా బంగాళాఖాతంలోనూ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది.

 

ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,

 

పిడుగులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ చెప్తోంది. రుతపవనాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కొద్ది రోజుల్లోనే రుతుపవనాలు దేశమంతా విస్తరిస్తాయని వివరించారు.