Hyderabad Fire Accident: అగ్ని ప్రమాదంపై కేసీఆర్ దిగ్బాంతి

Hyderabad Fire Accident, Breaking News: చార్మినార్ లో జరిగిన గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రామాదంలో 17మంది మరణించారు. ఇందులో 8మంది చిన్నారులు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారు బెంగాల్ కు చెందినవారిని అధికారులు తెలిపారు.
ప్రమాదం పై ప్రధాని మోదీ తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు 50వేలు ఒక్కోక్కరికి కేంద్రం తరపున ప్రకటించారు.