Home / MP Rahul Gandhi
Digvijay Singh’s brother expelled from Congress : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. లోక్సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీపై అతడు చేసిన వ్యాఖ్యల వల్లే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వెంటనే నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. లక్ష్మణ్ సింగ్ ఐదుసార్లు ఎంపీగా, మూడు […]
Central Election Commission Key Decisions about Rigging News: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ప్రతిపక్షాలు ఎన్నికలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని కీలక నేతలు దేశంలోని పలు రాష్ట్రాల్లో రిగ్గింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం వెల్లడించింది. 2024లో దేశ వ్యాప్తంగా […]
Rahul Gandhi participated in the Samvad program : లోక్సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఓ యువతి మధ్య పెళ్లి గురించి ఆసక్తికర చర్చ జరిగింది. బిహార్ పర్యటనలో మహిళా సంవద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన యువతతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో ఓ యువతి జరిపిన ఇంటరాక్షన్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రియా పాశ్వాన్ ఓ సామాజిక కార్యకర్త. సోషల్ మీడియా వేదికగా […]
Allahabad High Court angry with Rahul Gandhi : కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో భారత ఆర్మీని ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్కు చురకలు అంటించింది. సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడే హక్కు లేదని కోర్టు పేర్కొంది. రాహుల్ గాంధీ దేశంలో భారత జోడో […]
Rahul Gandhi’s key comments on Operation Sindoor : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని, ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్పై ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్లోని భోపాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడ్డారని విమర్శించారు. నరేందర్.. సరెండర్ అనగానే బెదిరిపోయాడన్నారు. ట్రంప్ భయంతోనే పాక్తో కాల్పుల […]
Union Minister Kishan Reddy : పాకిస్థాన్తో జరిగిన యుద్ధంతో దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు దేశ సైనికుల పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడటం బాధాకరమన్నారు. భారత్కు చెందిన రఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని రాహుల్ అడగటం సిగ్గు చేటన్నారు. శుక్రవారం ఢిల్లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా […]
Rahul Gandhi visits Delhi University: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖీలో మాట్లాడారు. యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులతో విద్యాపరమైన సమస్యలపై రాహుల్ చర్చించారు. విద్యార్థులు అన్నింటా ప్రాతినిధ్యం, సమానత్వం, విద్యాపరమైన న్యాయం వంటి పలు అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ డీయూఎస్యూ అధ్యక్షుడి కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశానికి విద్యార్థులు హాజరై తమ సమస్యలను […]
Rahul Gandhi : చార్మినార్ పరిధిలోని గుల్జార్హౌస్లో అగ్నిప్రమాదం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు. ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఆరా తీశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ప్రకటించారు. అన్ని పార్టీల నాయకులు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా లోక్సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో పలువురు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ […]
Rahul Gandhi, leader of the opposition in the Lok Sabha : దేశంలో అణగారిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులగణనకు అంగీకరించారని లోక్సభలో పతిపక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి మోదీ భయపడ్డారన్నారు. బిహార్లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు స్థానిక నేతలు, అధికారులు ప్రయత్నించారని […]
Congress leader and MP Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడితో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతిచెందగా, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హర్యానాలోని నర్వాల్ వినయ్ నివాసానికి వెళ్లి రాహుల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. హర్యానాకు చెందిన వినయ్ హిమన్షి పెళ్లి ఏప్రిల్ 16న జరుగగా, 19వ తేదీన విందు ఏర్పాటు చేశారు. అనంతరం అతడు భార్యను తీసుకొని జమ్మూకశ్మీర్కు హనీమూన్కు వెళ్లారు. ముందు యూరప్ వెళ్లాలని […]