Published On:

Raghunandan: ‘కవిత చెల్లని రూపాయి’.. ఎంపీ రఘునందన్ తీవ్ర వ్యాఖ్యలు

Raghunandan: ‘కవిత చెల్లని రూపాయి’.. ఎంపీ రఘునందన్ తీవ్ర వ్యాఖ్యలు

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెల్లని రూపాయి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కుటుంబంపై ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించారు తప్ప.. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను కేసీఆర్ దారుణంగా అవమానించారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దింపారని తెలిపారు. కాగా కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో అన్నా చెల్లెల గురించే చర్చ జరగాలని కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని.. అందుకే ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

 

కవిత, కేటీఆర్ కు ఇద్దరికీ బ్రాండ్ లేదన్నారు. నిజామాబాద్ ప్రజలకు కవిత ఏం చేయలేదనే ఎంపీగా ఓడించారని వెల్లడించారు. కవిత జాగృతి పెట్టకముందు రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుపుకోలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బలపడుతోందని.. ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. రాష్ట్రంలో పొత్తులు పెట్టుకొని గెలిచే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. పొత్తులు, విలీనాలపై తమ పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఇదంతా బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం అని మండిపడ్డారు.