Published On:

Phone Call: మద్యం మత్తులో ఫోన్.. ఢిల్లీ సీఎంను చంపుతానని బెదిరింపు

Phone Call: మద్యం మత్తులో ఫోన్.. ఢిల్లీ సీఎంను చంపుతానని బెదిరింపు

New Delhi: ఢిల్లీ సీఎం రేఖగుప్తాను చంపేస్తానని మద్యం మత్తులో పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తిని ఘజియాబాద్, ఢిల్లీ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి కొత్వాలి ప్రాంతానికి చెందిన శ్లోక్ త్రిపాఠిగా గుర్తించారు. తర్వాత అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్యతో గొడవపడి మద్యం మత్తులో బెదిరింపు ఫోన్ చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

 

ఈ మేరకు ఘజియాబాద్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఢిల్లీ సీఎం రేఖ గుప్తాను చంపేస్తామని బెదిరించాడు. అనంతరం ఫోన్ ను స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎంకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు. కాగా కాల్ చేసిన నెంబర్ గోరఖ్ పూర్ చిరునామాతో రిజిస్టర్ అయి ఉంది. దీంతో పోలీసులు ఆరా తీయగా సిమ్ వివరాలు బంధువు పేరు మీద ఉన్నట్టు గుర్తించారు.