Published On:

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Vallabhaneni Vamsi Health Update: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆయనను కంకిపాడు ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యపరీక్షల అనంతరం తిరిగి ఆయనను జైలుకు తరలించారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆయనకు శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కస్టడీలో ఉన్న ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే రెండుసార్లు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఆయన అనారోగ్యానికి తగిన చికిత్స అందిస్తున్నారు.

 

వంశీ అస్వస్థతకు గురైనట్టు సమాచారం తెలుసుకున్న ఆయన భార్య పంకజశ్రీ వెంటనే కంకిపాడు ఆస్పత్రికి చేరుకున్నారు. వంశీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆస్పత్రిలో వంశీని పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. మెరుగైన వైద్యం కోసం ఆయనను ఎయిమ్స్ కు తరలించాలని డిమాండ్ చేశారు.

 

కాగా గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో నూజివీడు కోర్టు ఆదేశాలతో వంశీని రెండు రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వంశీ అనారోగ్యంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.