Home / Vijayawada
Bomb Threat to Vijayawada Railway Station: విజయవాడకు వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాళ ఉదయం బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ రావడంతో స్థానికంగా ఉన్న షాపులు మూసివేయించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని నిర్ధారించుకుని షాపులు తెరిచేందుకు అనుమతినిచ్చారు. అనంతరం విజయవాడ రైల్వేస్టేషన్ లోనూ బాంబ్ పెట్టినట్టు రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని […]
Vallabhaneni Vamsi Health Update: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆయనను కంకిపాడు ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యపరీక్షల అనంతరం తిరిగి ఆయనను జైలుకు తరలించారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆయనకు శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కస్టడీలో ఉన్న ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే రెండుసార్లు ఆయనకు వైద్య పరీక్షలు […]
3 Killed in Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిని ముత్యాలమ్మగా గుర్తించారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది, మృతుల వివరాలు […]
AP CM Chandrababu : ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది ఇండియాలోనే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. విజయవాడలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో టెక్ ఏఐ కాంక్లేవ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ రహదారుల అభివృద్ధి.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. […]
12 thousand Crores Loan Deal with Foreign Banks for AP Metro Train Projects: ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక అడుగు పడింది. మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి పలు విదేశీ బ్యాంకుల, ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేఎఫ్ డబ్ల్యూ, ఏఎఫ్ డీ, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో భాగంగానే విజయవాడ కేంద్రంలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను విదేశీ బ్యాంకుల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో […]
Temple: విజయవాడ నగరంలో ఏపీలో పెద్ద నగరంగా తయారవుతోంది. పర్యటకంగా, ఆధ్యాత్మికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. ఇక విజయవాడ నగరం నడిబొడ్డున కృష్ణా నది తీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం కొలువై ఉంది. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. అమ్మను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి భక్తులరాక పెరిగింది. దీంతో ఆలయ అధికారులు, ప్రభుత్వం భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. […]
AP Congress: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆమె నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా అమరావతి రాజధాని పునఃప్రారంభంతోపాటు పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోదీ మే2న ఏపీకి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటనపై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. గతంలో 2015లో ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధాని మోదీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన […]
VIJAYA Offers 10% Discount on Vijayawada Route: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. విజయవాడ రూట్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు ఈ మార్గాల్లో దాదాపు 8 నుంచి 10శాతం వరకు చార్జీల్లో రాయితీ పొందవచ్చు. ఈ రాయితీలో భాగంగా లహరి నాన్ ఎసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 […]
Former MLA Vallabhaneni Vamsi arrested in Hyderabad: గన్నవరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయనను విజయవాడ పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వంశీని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. కిడ్నాప్తో పాటు పలువురిపై దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 140(1). 308, 351(3), […]
South Africa former Cricketer Jonty Rhodes visited BNI Vijayawada: దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ విజయవాడలో సందడి చేశారు. విజయవాడలో ఏపీ బీఎన్ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా కాంక్లేవ్ 3.0 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా నుంచి సుమారు 1500 మంది వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రణాళికలు ఉండాలి.. ఏ రంగంలో అయినా రాణించాలంటే.. […]