Home / ycp
High Tension In Podili: ప్రకాశం జిల్లా పొదిలిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పొదిలి పర్యటనకు వెళ్లారు. అక్కడ పొగాకు రైతులను పరామర్శించి.. వారితో ముఖాముఖి అవాలని నిర్ణయించారు. కానీ పొదిలిలో వైఎస్ జగన్ తెలుగు మహిళల నుంచి నిరసన సెగ ఎదురైంది. గో బ్యాక్ జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలు, బెలూన్లతో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు బెస్తపాలెం వద్ద […]
Prakasam Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించనున్నారు. అలాగే పొదిలిలో ఉన్న పొగాకు బోర్డును కూడా సందర్శించనున్నారు. రైతలతో సమావేశమై వారి ససమస్యలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముందుగా తాడేపల్లిలోని తన నివాసం వైఎస్ జగన్ బయల్దేరి.. ఉ. 11 […]
Andhra Pradesh: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఏకంగా 24.02 శాతం మేర పడిపోయిందని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. కాగ్ నివేదికలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా 3,354 కోట్లు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటన చేసిందని.. కానీ ఇది అబద్ధమని […]
Police Registered Case: మాజీ మంత్రి , వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులో నిన్న నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో అంబటి రాంబాబు పోలీసలతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా నిన్న పట్టాభిపురం సీఐపై ‘నీ అంతు చూస్తాను’ అంటూ పరుష పదజాలంతో అంబటి […]
Botsa Satyanarayana Falls Down on Stage: వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతతో కుప్పకూలారు. రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం పేరుతో పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరసన చేస్తుండగా అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ మట్లాడుతుండగానే […]
YS Jagan visits the affected families : రెడ్బుక్ రాజ్యాంగంతో ఏపీ అదుపు తప్పిందని, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రులు, వైసీపీ […]
Protests against YS Jagan visit to Tenali : గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం పర్యటించారు. పర్యటన కోసం కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్కు మాత్రం నిరసనల రూపంలో ఊహించని షాక్ తగిలింది. పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా చేపట్టి ఆందోళన చేశారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ను జగన్ పరామర్శించలేదని, రౌడీషీటర్లకు మద్దతుగా […]
Vallabhaneni Vamsi Falls Sick: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా కొంత కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం వంశీ అస్వస్థతకు గురవడంతో కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. […]
AP Ex Minister Kakani Arrested in Illegal Mining Case: ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి భారీ షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పెలుడు పదార్థాల వినియోగం వంటి అంశాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణిని ఏ-4 గా చేర్చుతూ.. కేరళలో ఆయనను […]
Vallabhaneni Vamsi Health Update: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆయనను కంకిపాడు ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యపరీక్షల అనంతరం తిరిగి ఆయనను జైలుకు తరలించారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆయనకు శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కస్టడీలో ఉన్న ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే రెండుసార్లు ఆయనకు వైద్య పరీక్షలు […]