Pawan Kalyan: కలియుగ కర్ణుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేవలం పది రోజుల్లోనే..!

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటే.. ఇప్పుడు రియల్ హీరోగా ప్రజలకు సాయం చేస్తూ గుండెల్లో చోటుసంపాదించుకుంటున్నారు. ఎవరైనా తమ సంపాదనను విలాసవంతమైన జీవితానికి ఖర్చు పెడుతారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన సంపాదనను పేద ప్రజల కోసం ఖర్చు చేస్తూ.. ఆపదలో ఉన్న వాళ్లందరికీ సాయం చేస్తూ.. మనసున్న మహారాజుగా ప్రజల మనసుల్లో చోటుసంపాదించుకున్నారు. సినిమాలు చేస్తున్న సమయంలోనే.. ఆయన ఎంతో మందిని ఆదుకున్నారు. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చాక.. ప్రజల సేవను ఇంటి పేరుగా మార్చుకున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా సమస్య వచ్చిన పరిష్కరించుకుంటూ కలియుగ కర్ణుడిలా బాధిత ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి నేనున్నా అని కొండంత భరోసానిస్తున్నారు. వెంటనే హామీ ఇచ్చి.. అమలు చేస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్కి జనాల్లో అంత క్రేజ్. అలాగే తక్కువ టైంలోని జాతీయ రాజకీయాలను కూడా ఆయన శాసించే స్థాయికి వెళ్లారంటే.. ఆయనకున్న ప్రజాభిమానం, ప్రజలకు సేవ చేయాలనే తపన, సమయస్ఫూర్తి అలాంటిది.
42మంది ఆనాథ పిల్లలను అక్కున చేర్చుకున్న పవన్
తాజాగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పెద్దమనసును చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అనాథ పిల్లల కోసం తన వేతనాన్ని ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన జీతం నుంచి 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని చెప్పారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఈ సాయాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాల జీతం మొత్తం అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మురళీనాయక్ కుటుంబానికి రూ.25లక్షల ఆర్థికసాయం
అలాగే ఇటీవల, దేశ సరిహద్దుల్లో వీర జవాన్ మురళీ నాయక్ యుద్ధం చేస్తూ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసానిచ్చారు. అయితే పవన్ వ్యక్తిగతంగా.. మురళీ నాయక్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు. మురళీ ఫ్యామిలీకి ఎలాంటి సాయం కావాలన్నా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ భరోసానిచ్చారు. మురళీనాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.అలాగే, ఏప్రిల్ 22న కశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు విడిచిన మధుసూధన్ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున రూ. 50 లక్షలు ప్రకటించారు. మధు సుధన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆ కుటుంబానికి పవన్ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.
ఇది కదా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే..
ఇలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుంటూ మహోన్నత వ్యక్తిగా ఎదుగుతున్నారు. అనాథ పిల్లలకు, వృద్ధులకు, వరద బాధితులకు ఇలా ఎవరూ ఆపదలో ఉంటే వారిని అక్కున చేర్చుకుంటున్నారు. జనాలు సమస్యల్లో ఉంటే చాలు.. అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. తోటి మనిషికి సాయం చేయాలన్న స్పందించే హృదయం కలిగిన గొప్ప వ్యక్తిగా పవన్ కల్యాణ్ ఎదిగారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక.. ప్రజలు ఊహించని విధంగా అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలకు పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాలు చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితోపాటు రాష్ట్ర సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతగా ముందుకెళ్తున్నారు. ఇది కదా మరి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే..!