Published On:

Pawan Kalyan on Sleeper Cells: స్లీపర్ సెల్స్ పై పవన్ సీరియస్.. సీఎస్, డీజీపీలకు లేఖ

Pawan Kalyan on Sleeper Cells: స్లీపర్ సెల్స్ పై పవన్ సీరియస్.. సీఎస్, డీజీపీలకు లేఖ

Pawan Kalyan on Sleeper Cells in AP:  రాష్ట్రంలో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.

 

స్లీపర్ సెల్స్, తీవ్రవాద సానుభూతిపరుల ఉనికిని గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని తెలిపారు. గుంటూరుతో పాటు ఇతర జిల్లాల్లోని రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. జాతీయ భద్రత, ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణించి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి: