Last Updated:

Sunil Deodhar: మూడు రాజధానుల పేరుతో మూడింతల అవినీతి

మూడు రాజధానుల పేరుతో వైకాపా ప్రభుత్వం మూడింతల అవినీతికి పాల్పడిందని బీజేపి నేత సునీల్ ధియోధర్ విమర్శించారు. నాడు ఒక్క రాజధాని పేరుతో అవినీతి తెదేపా చేపట్టిందని ఆయన పేర్కొన్నారు

Sunil Deodhar: మూడు రాజధానుల పేరుతో మూడింతల అవినీతి

Kurnool: కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతలకు వార్నింగ్ ఇచ్చారు. భూ మాఫియా చేస్తున్న నేతలకు శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే బాల నాగరెడ్డి ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది బీజేపా పార్టీ దశాబ్ధాల డిమాండ్ గా పేర్కొన్నారు.

మాజీ ఎంపీ టీజి వెంకటేష్ కూడా మీడియాతో మాట్లాడారు. కేంద్రం క్యాన్సర్ వైద్యశాల నిర్మాణానికి వంద కోట్లు కేటాయిస్తే , ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేదని దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండి: