Last Updated:

Mahesh Babu: స్క్రిప్ట్ విషయంలో రాజీ పడని మహేష్ బాబు

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా అనగానే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం అతడు. అయితే తాజా ప్రాజెక్టు పై మొదటి రోజు నుంచే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Mahesh Babu: స్క్రిప్ట్ విషయంలో రాజీ పడని మహేష్ బాబు

Tollywood: మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా అనగానే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం అతడు. అయితే తాజా ప్రాజెక్టు పై మొదటి రోజు నుంచే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫైనల్ స్క్రిప్ట్‌తో మహేష్ బాబు కన్విన్స్ అవలేదని సమాచారం. దీనితో త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ పై మళ్లీ పని చేయడానికి తన సమయాన్ని తీసుకున్నాడు.

ఇటీవలే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా హైవోల్టేజ్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ని చిత్రీకరించారు. త్రివిక్రమ్ ఫైనల్ నేరేషన్ తర్వాత కూడా మహేష్ పూర్తిగా కన్విన్స్ కాలేదనే టాక్. తొలి షెడ్యూల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ కావడంతో షూటింగ్‌ని స్టార్ట్‌ చేశారు. కొన్ని సీక్వెన్స్‌లను రీవర్క్ చేయమని త్రివిక్రమ్‌ని కోరాడు. త్రివిక్రమ్ మళ్లీ ఈ ఎపిసోడ్స్‌కు పని చేయడానికి తగినంత సమయం అడిగాడు. ఈ బ్రేక్‌ని ఉపయోగించుకుని మహేష్ ఇప్పుడు ఫారిన్ హాలిడేకి వెడుతున్నాడు. మహేష్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను మార్పులతో వివరించనున్నారు.

మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇటీవల మరణించారు. అనంతరం మహేష్ ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్ కూడా పూర్తి చేశాడు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా, మహేష్ తన కుటుంబంతో ఫారిన్ లో గడపనున్నాడు. నవంబర్‌లో సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాతలు. ఈ చిత్రం 2023 వేసవిలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి: