Published On:

Pakistan: యుద్ధం వద్దు తిండి పెట్టండి చాలు, పాక్ యువత వేడుకోలు

Pakistan: యుద్ధం వద్దు తిండి పెట్టండి చాలు, పాక్ యువత వేడుకోలు

Pakistan:  21వ శతాబ్దంలో కూడా యుద్ధాలు చేయడం మూర్ఖత్వం అంటున్నారు పాకిస్తాన్‌కు చెందిన చదువుకున్న యువకులు. మాకు యుద్ధం వద్దు ఉపాధి కల్పించండి.. మెరుగైన మౌలిక వసుతులు కల్పించండి అంటూ పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌తో పాటు ఆర్మీచీప్‌ అసిమ్‌ మునీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్‌ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపధ్యంలో ప్రజలు మాత్రం తమకు యుద్ధం వద్దు.. తిండి పెట్టండి చాలు అంటున్నారు. దేశంలో ఒక వైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అస్థిరత ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇండియాతో ఏ ముఖం పెట్టుకొని యుద్ధానికి పోతారంటూ దేశంలోని యువత తో పాటు సామాన్యుడు పాక్‌ ప్రభుత్వం.. ఆర్మీని నిలతీస్తున్నాడు.

 

పాకిస్తాన్‌పై భారత్ ఆంక్షలు
పాకిస్తాన్‌పై భారత్ ఆంక్షలు విధించింది. భారత సముద్ర జలాలపై ఆంక్షలు విధించింది. పాక్ ఓడలు భారత్ పోర్టులకు రావడాన్ని నిషేధించింది. భారత్ ఓడలు పాక్ పోర్టులకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది భారత్. తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పాక్ నుంచి వచ్చే దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. కేంద్ర వాణిజ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌తో భారత్ వాణిజ్యం పూర్తిగా రద్దు చేసుకుంది. ప్రత్యక్ష ఎగుమతులు, దిగుమతులు నిలిపివేసింది. పరోక్ష దిగుమతులు కూడా రద్దు చేసింది. నిషేధం నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ భద్రత, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ..నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

 

పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ
పహెల్‌గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బతీయాలని భారత్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దు తో పాకిస్తాన్ పై ఇటీవల నీటి యుద్ధానికి తెరదీసింది భారత్. దీంతో లబోదిబోమంటోంది దాయాది దేశం. ఇది చాలదన్నట్లు పాకిస్తాన్ ఆర్థిక మూలాలను సమూలంగా దెబ్బతీయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇందులో భాగంగా దాయాది దేశంపై ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు రంగం సిద్ధం చేస్తోంది.

 

భారత్ చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. భారత్‌తో రాయబారం చేయాలంటూ..ప్రపంచ దేశాలను వేడుకుంటోంది. చైనా, గల్ఫ్, యూఏఈ దేశాల..హైకమీషనర్లతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. చైనా అంబాసిడర్ జియాంగ్ జయోడాంగ్, UAE అంబాసిడర్ హమీద్ ఒబైడ్..కువైట్ అంబాసిడర్ నసీర్ అబ్దుల్లా రెహమాన్‌లతో భేటీ అయ్యారు. భారత్ చర్యలపై సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్‌కు అండగా ఉండాలంటూ వేడుకున్నారు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ దేహీ అంటోంది.

 

ముమ్మరమైన NIAవిచారణ
పహల్గాం ఉగ్ర దాడి కేసులో ఎన్‌ఐఏ విచారణ ముమ్మరమయ్యింది. పాత ఉగ్రవాదులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2023లో రాజౌరిలో దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను..జమ్మూ జైలులో ప్రశ్నిస్తున్నారు. అధికారులు..కీలక సమాచారం సేకరిస్తున్నారు. పహల్గాం ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 2023 జనవరిలో రాజౌరీలోని ధోంగ్రీ గ్రామంపై..ఇద్దరు ఉగ్రవాదుల దాడి చేశారు. ఘటనలో ఐదుగురు పౌరులు మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన..నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.