Last Updated:

Pakistan: పాకిస్తాన్ లో రాత్రి 8:30 గంటలకు మార్కెట్లు, మాల్స్ మూసివేత.. కారణమేంటో తెలుసా..?

తీవ్ర ఆర్దికసంక్షోభం, నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ జనవరి 3 నుంచి మార్కెట్లు, మాల్స్ మరియు కళ్యాణ మండపాలను ముందుగానే మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Pakistan: పాకిస్తాన్ లో రాత్రి  8:30 గంటలకు మార్కెట్లు, మాల్స్ మూసివేత.. కారణమేంటో తెలుసా..?

Pakistan: తీవ్ర ఆర్దికసంక్షోభం, నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ జనవరి 3 నుంచి మార్కెట్లు, మాల్స్ మరియు కళ్యాణ మండపాలను ముందుగానే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన ఇంధన పొదుపు పథకం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇంధనాన్ని ఆదా చేయడానికి మరియు దిగుమతి చేసుకున్న చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్లాన్‌కు పాకిస్తాన్ క్యాబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు.పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకారం మార్కెట్లు మరియు మాల్స్ ఇప్పుడు రాత్రి 8:30 గంటలకు మూసివేయబడతాయి, అయితే పాకిస్తాన్‌లోని వివాహ మందిరాలు రాత్రి 10:00 గంటలకు మూసివేయబడతాయి. ఈ చర్య మాకు రూ. 60 బిలియన్లను ఆదా చేస్తుందిని తెలిపారు. ఆర్దికసంక్షోభాన్ని ఎదుర్కోవటానికి దేశం మరికొన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 1 నుండి ప్రకాశించే బల్బుల తయారీని, జూలై నుండి అవసరం లేని ఫ్యాన్ల ఉత్పత్తి నిలిపివేయబడతాయి. వీటివల్ల మరో రూ. 22 బిలియన్లు ఆదా అవుతుందన్నారుప్రభుత్వం ఒక సంవత్సరం లోపు గీజర్ల వినియోగాన్ని తప్పనిసరి చేస్తుంది. తక్కువ గ్యాస్ ఉపయోగించడం ద్వారా రూ. 92 బిలియన్లు ఆదా అవుతాయి. వీధి దీపాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం ద్వారా మరో రూ. 4 బిలియన్లు ఆదా అవుతుంది.అన్ని ప్రభుత్వ భవనాలు మరియు కార్యాలయాలు కూడా ప్రణాళిక ప్రకారం ఇంధన వినియోగాన్ని తగ్గిస్తాయిఇంటి నుండి పని చేసే విధానాన్ని కూడా 10 రోజులలోపు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వ శాఖలు వినియోగించే విద్యుత్‌లో 30 శాతం ఆదా చేసేందుకు కేబినెట్ యోచిస్తోందని, దీనివల్ల రూ.62 బిలియన్లు ఆదా అవుతాయని ఆయన చెప్పారు,ఇంధన దిగుమతిని తగ్గించేందుకు 2023 చివరి నాటికి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెడతామన్నారు. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (జూలై-అక్టోబర్) ద్రవ్యోల్బణం 21-23 శాతం మధ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేయడంతో దేశ ఆర్థిక లోటు 115 శాతానికి పైగా పెరగడంతో దేశ ఆర్థిక పరిస్థితి అందోళనకరంగా మారింది.

ఇవి కూడా చదవండి: