Published On:

Salman’s Sikandar OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న సల్మాన్‌ ఖాన్‌, రష్మిక మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Salman’s Sikandar OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న సల్మాన్‌ ఖాన్‌, రష్మిక మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Salman’s Sikandar Movie OTT Release and Streaming Date: బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం సికిందర్‌. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30 ఈథ్‌ సందర్భంగా విడుదలైంది. భారీ బడ్జెట్‌తో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కానీ ప్రేక్షకులను మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

 

దాదాపు రూ. 210 కోట్ల బడ్జెట్‌ తెరకెక్కిన ఈ సినిమా రూ. 210 కోట్ల కలెక్షన్స్‌ మాత్రమే రాబట్టింది. కాజల్‌ అగర్వాల్‌, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. థియేట్రికల్‌ రన్‌లో కేవలం రూ. 210 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. బాలీవుడ్‌ ఏ సినిమా అయినా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీకి వస్తుంది. అదే బాటలో సికందర్‌ కూడా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. మే 25 నుంచి మూవీ డిజిటిల్‌ వేదికపై సందడి చేయనుంది.

 

ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ విడుదలై రెండు వారాలు అవుతున్న సందర్భంగా మే 25 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కి ఇవ్వబోతోంది. అంటే ఈ రోజు అర్థరాత్రి నుంచి సికందర్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. కేవలం హిందీలోనే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడతో పాటు హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. కాగా గ్రాండ్‌ సన్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్లపై సాజిద్‌ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

రాజ్‌కోట్ సంస్థాన వారసులు సంజయ్ అలియాస్ సికిందర్, రాజాసాబ్‌ (సల్మాన్‌ ఖాన్‌) రాణి సాయిశ్రీ (రష్మిక మందన్నా) భార్యభర్తలు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తుంటారు. తమ రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకొంటారు. ఈ క్రమంలో ఒకరోజు మంత్రి ప్రధాన్‌తో (సత్యరాజ్‌) వైరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో వారి మధ్య జరిగిన యుద్ధంలో సికందర్‌ భార్య సాయిశ్రీ మరణిస్తుంది. ఆమె చనిపోతూ ముగ్గురికి తన అవయవాలను దానం చేయమని చెబుతుంది. అయితే రాణి అవయవదానం పొందిన వారు మంత్రి ప్రధాన్‌ నుంచి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముగ్గురి జీవితాల్లోకి సికిందర్‌ ఎలా ఎంటర్‌ అవుతాడు. మంత్రి ప్రధాన్‌ అనుచరుల నుంచి వారిని సికందర్‌ ఎలా కాపాడుతా? ఇంతకీ సాయిశ్రీ ఎలా మరణించింది. అవయవదాన గ్రహీత వైదేహీ (కాజల్‌ అగర్వాల్‌)కు ఉన్న సమస్య అనేది సినిమాలో తెలుసుకోవాల్సిందే.