Last Updated:

Pawan Kalyan : మళ్ళీ సింగర్ గా మారనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ మూవీ కోసమేనా!

పవర్ స్టార్  పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో క్రిష్ జాగర్లమూడీ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం “హరి హర వీర మల్లు” కూడా ఒకటి. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న

Pawan Kalyan : మళ్ళీ సింగర్ గా మారనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ మూవీ కోసమేనా!

Pawan Kalyan : పవర్ స్టార్  పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో క్రిష్ జాగర్లమూడి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం “హరి హర వీర మల్లు” కూడా ఒకటి. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియన్ మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పలువురు టాలీవుడ్, బాలీవుడు తారాగణం ప్రముఖ పాత్రలు పోషించనున్నారు. ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ ఈ చారిత్రాత్మక మూవీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం కీరవాణి సంగీతం అందించడం మరో ప్రత్యేక విషయం అని చెప్పాలి.

అయితే దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా కరోన వల్ల కొంత ఆలస్యం అవ్వగా.. పవన్ రాజకీయాలు, ఇతర సినిమాల కారణంగా మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు మళ్లీ ఊపందుకుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ ఈ సినిమా కోసం మరోసారి సింగర్ అవతారం ఎత్తానున్నారని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా డైరెక్టర్ క్రిష్ పవన్ తో ఒక పాట పాడించాలని అనుకుంటున్నాడట.

Hari Hara Veera Mallu - IMDb

గతంలో పవన్ కళ్యాణ్ ఆయన నటించిన పలు సినిమాలో పాటలు పాడి అలరించారు. అవి ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని క్రిష్ మళ్లీ పవన్ ను ఓ పాటకు సింగర్ చేయాలనుకుంటున్నాడట. దీనికి పవన్ కూడా పాట పాడడానికి అంగీకరించారని సమాచారం అందుతుంది. ఈ పాట సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో రానుండగా.. ఈ పాటను రికార్డు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయని చర్చించుకుంటున్నారు. పవన్ అభిమానులే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు సైతం ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అలానే సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, పవన్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అది ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 28న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ఉస్తాద్ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా.. ఓజీ సినిమాని సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. మొత్తానికి వరుస సీనిమాలను త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు పవన్.