Home / PM Modi
బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతుంది. అందులో భాగంగానే పార్టీ అగ్ర నేతలంతా రాష్ట్రంలో వరుసగా ప్రచారం చేస్తూ ఫుల్ జోష్ నింపుతున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఇప్పటికే పలుసార్లు పర్యటించగా.. ప్రస్తుతం ప్రచారం చివరి దశకు చేరుకున్నందున మూడు రోజులు వరుసగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అటు సినిమాల వల్ల గాని ఇటు రాజకీయాల వాలా గాని జనాలలో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పవన్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ ఇటు సినిమాలకు అటు రాజకీయాల్లోకు సమన్యాయం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మీయ సభలో పాల్గొన్నారు మోదీ. ఇక ఈ క్రమంలోనే ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ..
రైతుల పేరుతో కొందరు రాజకీయాలు చేశారంటూ ప్రధాని మోదీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేసారు. గురువారం షిర్డీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు చాలా ఏళ్లుగా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కాని రైతులకు ఏం చేశాడు? అంటూ ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉత్తరాఖండ్లో పర్యటించారు. అతను శివుని పవిత్ర నివాసంగా భావించే ఆది కైలాస శిఖరం నుండి తన పర్యటనను ప్రారంభించారు. పార్వతి కుంద్ లోని ఆది కైలాస శిఖరం వద్ద ప్రార్థనలు చేశారు. తెల్లటి వస్త్రాలు ధరించిన మోదీ స్దానిక పూజారులు వీరేంద్ర కుటియాల్ మరియు గోపాల్ సింగ్ ల సూచనల మేరకు పూజలు నిర్వహించారు.
ప్రధాని మోదీ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత ఆదివారం నాడు మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం. ఈ వరుస పర్యటనల నేపధ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.
మూడు రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కెటిఆర్ వరుస ప్రశ్నలు సంధించారు. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి సార్ అని కెటిఆర్ ప్రశ్నించారు. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం, పోసేదెప్పుడు.. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు.? మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడని నిలదీశారు.
మహబూబ్నగర్లో పర్యటించిన ప్రధాని మోదీ 13వేల, 500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణకు ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభ సాక్షిగా ప్రకటించారు.
గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత డ్రైవ్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ రాజకీయ నాయకుల నుండి విద్యార్థుల వరకు ఆదివారం ఒక గంటపాటు శ్రమదానంలో పాల్గొన్నారు. ఆయన పిలుపునిచ్చిన - 'ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్' ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించబడింది.