Home / PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం లక్షద్వీప్లో స్నార్కెలింగ్ చిత్రాలను పంచుకున్నారు . లక్షద్వీప్ సహజమైన బీచ్ల వెంట ఉదయాన్నే నడకలు స్వచ్ఛమైన ఆనందాన్ని కలిగించే క్షణాలు అని అన్నారు. లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్నుప్రారంభించారు. తమిళనాడులో రూ.20,140 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో తిరుచ్చి చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్రమంత్రి ఎల్.మురుగన్, స్వాగతం పలికారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం అయోధ్య పట్టణానికి చేరుకుని అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు.రైల్వే స్టేషన్ నుండి రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన యూట్యూబ్ ఛానెల్కు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగివున్న తొలి ప్రపంచ నేతగా నిలిచారు. ప్రధానమంత్రి యూట్యూబ్ ఛానెల్కు మొత్తం 20 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు, అందులో 23,000 వీడియోలు అప్లోడ్ చేయబడ్డాయి.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికకు నిరసనగా ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై బజరంగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన సుదీర్ఘ లేఖను X లో షేర్ చేసారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరగకపోవడమే కారణమని ఈ లేఖలో పునియా పేర్కొన్నారు.
పార్లమెంటు ఆవరణలో తృణమూల్ ఎంపీ ఒకరు తనను అనుకరిస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ బుధవారం వెల్లడించారు. దీనిపై విచారం వ్యక్తం చేసిన మోదీ తాను కూడా గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి అవమానాలను భరించానని చెప్పారని అన్నారు.
కాప్ 28 వాతావరణ సదస్సులో $475 మిలియన్ల 'లాస్ అండ్ డ్యామేజ్' ఫండ్ను అమలు చేయాలన్న యూఏఈ అధ్యక్షుడి 'చారిత్రక' నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన కాప్28 సదస్సు కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు 'నమో డ్రోన్ దీదీ' కార్యక్రమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా చేపట్టిన విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో సంభాషించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన పథకాలను సద్వినియోగం చేసుకోవలన్నారు. ఈ పథకాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరతాయని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్ నుంచి కాచిగూడ వరకు 2 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్షో సాగింది. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. ప్రధాని మోదీపై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే బీజేపీ కేంద్ర హోంమంత్రి