Home / PM Modi
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల క్రితం రాజస్థాన్లోని బాంస్వారాలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. ఇక మోదీ చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే.. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని సంపదతో పాటు తల్లుల, సోదరి మణుల బంగారం లెక్క వేసి దేశంలోకి అక్రమ చొరబాటు దారులకు... ముస్లింలకు సమానంగా పంచుతామని ప్రకటించింది.
అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవడానికి దేశంలోని మారు మూల ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. మంగళవారం దర్శనానికి అనుమతించడంతో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. నిన్న ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది దర్శనం చేసుకున్నారు. ఇక కేంద్రం మంత్రులు కూడా ఎప్పుడెప్పడు రాముడిని దర్శించుకోవాలా అని ఆత్రుతపడుతున్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటించింది. కర్పూరీ ఠాకూర్ వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా పేరు పొందారు.జనవరి 24న కర్పూరి ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు.అనంతరం బాలరాముడికి ప్రధాని తొలి హారతి ఇచ్చారు.
శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. మరి కోన్ని గంటల్లో బాల రాముడి విగ్రహానికి వేద పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ మహా క్రతువులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు సుమారు 7 వేల మంది అతిథులు హాజరుకానున్నారు.
: ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. పీఎంఏవై-అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లను, షోలాపూర్లోని రాయ్నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను ప్రధాని దేశానికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్ను పిఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీగా ఆయన పేర్కొన్నారు
అయోధ్యలోని రామమందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల అనుస్టాన్ (దీక్ష) పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నేలపై నిద్రిస్తూ కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అయోధ్యలోని శ్రీరామ మందిరంపై స్మారక పోస్టల్ స్టాంపులను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడికి అంకితం చేసిన స్టాంపుల పుస్తకాన్ని విడుదల చేశారు. రామ మందిరం.గణేషుడు,హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్ , శబరి లతో కూడిన ఆరు స్టాంపులను విడుదల చేసారు.
శుక్రవారం మహారాష్ట్రలోని నాసిక్లోని కాలరామ్ ఆలయంలో జరిగిన 'స్వచ్ఛత అభియాన్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా దేవాలయాల వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు (క్లీన్నెస్ డ్రైవ్లు) నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం లక్షద్వీప్లో స్నార్కెలింగ్ చిత్రాలను పంచుకున్నారు . లక్షద్వీప్ సహజమైన బీచ్ల వెంట ఉదయాన్నే నడకలు స్వచ్ఛమైన ఆనందాన్ని కలిగించే క్షణాలు అని అన్నారు. లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.