Home / national
Operation Sindoor : భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. పాక్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతినిధుల బృందాలకు 7 మంది ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు. ఏడుగురు వీరే.. కాంగ్రెస్ పార్టీ నుంచి శశిథరూర్, బీజేపీ పార్టీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీ-యూ నుంచి సంజయ్కుమార్ ఝా, డీఎంకే నుంచి కనిమొళి, ఎన్సీపీ-ఎస్పీ నుంచి […]
Union Home Minister Amit Shah : దేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో షా మాట్లాడారు. 2014 ఏడాదకి ముందు ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయని గుర్తుచేశారు. కానీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. ఇప్పుడు అలా కాదని, శత్రు దేశం పాక్కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. భారత్ సైన్యం ఇటుకలకు రాళ్లతో […]
Six Indians, including YouTuber Jyoti, Arrested : పహల్గామ్ ఉగ్రదాడితో అధికారులు అలర్ట్ అయ్యారు. జమ్మూ కశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్ అధికారులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్న వారి గుట్టును రట్టుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక సమాచారాన్ని పాకిస్థాన్ అధికారులతో పంచుకుంటున్న హర్యానాకు చెందిన ఓ యూట్యూబర్ సహా ఆరుగురు భారతీయులను అధికారులు అరెస్టు చేశారు. ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హో త్రా అరెస్టు.. పాక్కు సున్నితమైన […]
MP Shashi Tharoor gets a place in the all-party team : ఇండియాపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాక్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు కేంద్రం పూనుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించటానికి 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతినిధుల బృందాలకు 7 మంది ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు. అందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ పంపిన లిస్టులో శశిథరూర్ పేరు లేకపోవడం గమనార్హం. ఈ […]
Gold price falls : అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో దేశీయంగా గోల్డ్ ధర దిగొచ్చింది. భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గడమే ఇందుకు కారణం. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.1800 తగ్గి, రూ.95,050 పన్నులు కలుపుకొని పలుకుతోంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ.94,600 వద్ద కొనసాగుతోంది. గురువారం సాయంత్రం 5 […]
Rahul Gandhi, leader of the opposition in the Lok Sabha : దేశంలో అణగారిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులగణనకు అంగీకరించారని లోక్సభలో పతిపక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి మోదీ భయపడ్డారన్నారు. బిహార్లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు స్థానిక నేతలు, అధికారులు ప్రయత్నించారని […]
Supreme Court serious about Minister Vijay Shah : భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వ్యాఖ్యలు వివాదం కావడంతో కేసు నమోదైంది. అనంతరం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా మంత్రి తీరును తప్పుపట్టింది. హైకోర్టులో క్షమాపణలు చెప్పాలని సూచనలు చేసింది. మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం.. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి […]
IPL 2025 : ఇండియా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులపాటు బీసీసీఐ వాయిదా వేసింది. ఐపీఎల్ తిరిగి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు దక్షిణాఫ్రికా గుడ్న్యూస్ చెప్పి భారీ ఊరట కల్పించింది. మొదట దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్కు ఈ నెల 26వ తేదీ వరకే అందుబాటులో ఉంటారని ప్రకటించింది. జూన్లో […]
President Draupadi Murmu : రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా కాలయాపన చేస్తుండటం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు జాప్యానికి గురికావడంపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీం తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం ఈ మేరకు […]
Pakistan’s letter to India : ఇప్పుడు పాక్ కాళ్లబేరానికి వచ్చింది. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలివేయడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పాక్కు జరిగిన నష్టం గురించి ఇప్పుడు తెలుసొచ్చింది. మొన్నటి వరకు సింధూ జలాల అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన పాక్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు భారత్ అంగీకరించినా సింధూ జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ప్రకటించింది. దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని […]