Home / national
3 dead in Sikkim landslide: సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర సిక్కింలోని చట్టేన్ సమీపంలో మిలటరీ శిబిరంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఆరుగురు భద్రతా సిబ్బంది ఆచూకీ కనిపించడం లేదని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదివారం రాత్రి 7 గంటలకు కొండచరియలు విరిగిపడినట్లు రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు గుర్తించగా.. మరో నలుగురు ప్రమాదం నుంచి బయటపడినట్లు […]
Essay Competition : పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. ఈ నేపథ్యంలో రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి యువత మనసులోని భావాలను వినిపించేందుకు ఒక అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆన్లైన్లో వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 30వరకు వ్యాసరచన పోటీ అందుబాటులో ఉంటుంది. ఒకరు ఒకేసారి పోటీల్లో పాల్గొనవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వ్యాసరచనం రాసేందుకు మాత్రమే […]
National Investigation Agency : జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబయి, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన నివాస గృహాలు, కార్యాలయాలు వీటిలో ఉన్నాయి. తనిఖీల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. కొన్ని సున్నితమైన ఆర్థిక పత్రాలు దొరికాయి. పాక్ నుంచి […]
Dutch MP urges PM Modi to release law student : ఆపరేషన్ సిందూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుపై తాజాగా డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయం వ్యక్తంచేశారు. కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా […]
AP Deputy CM Pawan Kalyan fires on TMC MPs : ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇన్ఫ్లూయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ అభ్యంతరకర పోస్టు పెట్టింది. దీంతో కోల్కతా పోలీసులు శనివారం విద్యార్థిని అరెస్టు చేశారు. విద్యార్థి అరెస్టుపై ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. […]
‘Operation Shield’ in border Districts : రాజస్థాన్లోని పాక్ సరిహద్దు జిల్లాలతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా శనివారం ‘ఆపరేషన్ షీల్డ్’ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారు పరుగులు తీశారు. ఈ ఘటన రియల్ మాక్ డ్రిల్ను తలపించింది. ఝలావర్లోని కాలిసింధ్ డ్యామ్ వద్ద మాక్ డ్రిల్ సందర్భంగా డ్రోన్ దాడి జరుగుతుందన్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో అక్కడ ఉన్న కలెక్టర్, ఎస్పీతోపాటు చాలామంది అధికారులు, […]
Reduced LPG cylinder price : ప్రతినెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు కొద్దిగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్ ధరను రూ.24 తగ్గించినట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,723.50కు చేరింది. కోల్కతాలో రూ.1826, ముంబయిలో రూ.1674.50, చెన్నైలో రూ.1881గా ధరలు ఉన్నాయి. గృహ వినియోగదారులకు నిరాశ.. గృహ వినియోగదారులకు […]
Former Kerala BJP president K.Surendran accuses YouTuber Jyoti Malhotra : పాక్ నిఘా సంస్థలకు భారత్కు చెందిన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జ్యోతి కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళ పర్యాటక శాఖ మంత్రి పీఏ.మహమ్మద్ రియాస్ నేతృత్వంలో జ్యోతి పర్యటనకు టూరిజం శాఖ స్పాన్సర్ చేసిందని పేర్కొన్నారు. రియాస్ రాష్ట్ర సీఎం పినరయి […]
CDS General Anil Chauhan Key comments : పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో తమ తప్పులను సరిదిద్దుకొని దీటుగా స్పందించామని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైన మాట నిజమేనని అంగీకరించారు. అయినా వెంటనే సవాళ్లను అధిగమించి శత్రుమూకలపై విరుచుకుపడ్డామన్నారు. ఈ సందర్భంగా కొంత నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనన్నారు. ఆరు జెట్లను కూల్చేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న వాదన మాత్ర తప్పు అని సీడీఎస్ స్పష్టం చేశారు. సింగపూర్లో […]
Pakistan cricketer Afridi at Kerala Event : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పట్ల భారతీయులు కోపంతో రగిలిపోతున్నారు. భారత్లోనే కాదు.. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా పాక్ను బహిష్కరించారు. పాకిస్థాన్కు సాయం చేసిందన్న కారణంతో టర్కీని కూడా బ్యాన్ చేశారు. అలాంటిది పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కేరళకు చెందిన కొందరు ఘన స్వాగతం పలికారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ సైన్యంపై అఫ్రిది నోరు పారేసుకున్నారు. సిగ్గులేకుండా కేరళ వంటకాలను రుచి […]