Home / latest national news
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. లోకసభ కొత్త స్పీకర్ ఎంపిక కోసం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో మంత్రులు మంగళవారం సాయంత్రం సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
కన్నడ చాలేంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్ లీలలు ఒక్కొక్కటి నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపిన దర్శన్ ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు.
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందగా..60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి కారణం గూడ్స్ రైలు కంచన్జుంగ ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి ఢీ కొట్టడమని పోలీసులు వివరించారు.
కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్ ధర లీటరుకు రూ.3 పెంచింది. సవరించిన రేట్లు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్పై అమ్మకం పన్ను 29.84 శాతం, డీజిల్పై 18.44 శాతం పెంచింది.
విసిగించే కాల్స్కు మోసపూరిత కాల్స్కు ఇక చెక్ పడనుంది. కేంద్రప్రభుత్వం ఒత్త్తిడితో పాటు టెలికం నియంత్రణా సంస్థ (ట్రాయ్) కూడా టెలికం ఆపరేటర్లపై ఒత్తిడి తేవడంతో విధి లేని పరిస్థితిలో దేశంలోని కొన్ని ఏరియాలో కాలర్ ఐడి సర్వీసులను అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉంది.
తాజాగా అరుంధతీయ రాయ్, మాజీ కశ్మీర్ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్కు వ్యతిరేకంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అత్యంత కఠిన చట్టం కింది కేసు నమోదు చేయమని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. . 23 మంది ప్రయాణికులతో బయలు దేరిన టెంపో ట్రావెలర్ లోయలో పడ్డంతో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్లోని భద్రీనాథ్ జాతీయ రహదారిలో రుద్రప్రయాగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానం గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. వాస్తవానికి అసలు గడువు జూన్ 30తో ముగియాల్సి ఉండగా ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించింది. మోసాలను తగ్గించేందుకు ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ చర్య లక్ష్యం.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కటకట తీవ్రంగా ఉంది. రాజధాని ప్రజలను మంచి నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. అదే సమయంలో ట్యాంకర్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు కొనసాగనున్నాయి. కాగా మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైనా లోకసభ సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతుంది.