Home / latest national news
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మోహన్ చరణ్ మాఝీ పేరు ఖరారయింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కియోంఝర్ నుంచి 87,815 ఓట్ల మెజారిటీతో బీజేడీకి చెందిన మినా మాఝీపై విజయం సాధించారు. బుధవారం ఆయన ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఢిల్లీలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం ఖాళీ చేయడానికి సుప్రీంకోర్టు ఆగస్టు 10వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో ఆప్ పార్టీ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది.
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చారు. వచ్చి రాగనే పీఎం కిసాన్నిధి 17వ ఇన్స్టాల్మెంట్ ఫైల్పై సంతకం చేశారు.
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ను చండీఘడ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ సందర్భంగా అక్కడి లేడీ కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. అటు తర్వాత సోషల్ మీడియాలో దీనిపై పెద్ద దుమారమే రేగింది.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్గాంధీ లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాహుల్ను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రతాప్సింగ్ బజ్వా చెప్పారు.
లోక్ సభలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపికైన నరేంద్రమోదీ ... ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ను చండీఘడ్ విమానాశ్రయంలో అక్కడి మహిళా సెక్యూరిటీ గార్డు గురువారం చాచి లెంపకాయ కొట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా రనౌత్ చండీఘడ్ నుంచి ఢిల్లీకి బయలుదేరడానికి ముందు సెక్యూరిటీ చెక్ వద్ద ఈ ఘటన జరిగింది.
బెంగళూరు కోర్టులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బెయిల్ దక్కింది. గత ఏడాది కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పటి భారతీయ జనతాపార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, 40 శాతం కమిషన్ తీసుకుని పనులు చేస్తోందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వార్త పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లోని మండి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
లోకసభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు దక్కించుకుంది. మెజారిటి మార్కు 272 కాగా బీజేపీకి 32 సీట్లు తగ్గాయి. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కాగా ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడో సారి జూన్ 8న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ మొత్తం 292 సీట్లు సాధించింది.