Home / latest national news
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మధ్య శనివారం నాడు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య రక్షణ రంగంతో పాటు రక్షణ ఉత్పత్తులు, కౌంటర్ టెర్రరిజానికి సంబంధించిన అంశాల్లో ఒకరి కొకరు సహాయం చేసుకోవడంతో పాటు సరిహద్దు అంశాల గురించి న్యూఢిల్లీలో వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి
ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత దాదాపు 48 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదు అవుతోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం నగరంలో ట్యాంకర్ల ముందు చాంతాడంత క్యూలైన్లు కనిపించాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని నిర్వాహకులను చీవాట్లు పెట్టింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా.. సహించేది లేదని హెచ్చరించింది.
బిహార్లో నితీష్కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో చుక్కెదురైంది. గత ఏడాది నవంబర్లో రిజర్వేషన్ చట్టాన్ని సవరించి మొత్తం రిజర్వేషన్ కోటాను 65 శాతానికి సవరించింది
తమిళనాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం సేవించి 34 మంది చనిపోయారని కల్కురిచి జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ గురువారం తెలిపారు. సుమారు 60 మంది ఆస్పత్రి పాలయ్యారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం మొత్తం 107 మందిని ఆస్పత్రిలో చేర్పించారు.
అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారీ వరదలకు సుమారు 15 జిల్లాల్లో 1.61 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపించింది.
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప మేనేజర్ శ్రీధర్ బెంగుళూరులోని దర్శన్ ఫామ్హౌస్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. శ్రీధర్ మృతదేహంతో పాటు సూసైడ్ నోటు, వీడియో మెసేజును పోలీసులు గుర్తించారు. తన చావుకు తానే కారణమని దర్యాప్తులో తన కుటుంబాన్ని చేర్చవద్దని లేఖలో శ్రీధర్ పేర్కొన్నారు.
బీహార్లోని అరారియా జిల్లాలో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి రెండ్రోజుల ముందే కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిపోవడం యొక్క షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వంతెన మొదట పూర్తిగా నీటిలో మునిగిపోయే ముందు పాక్షికంగా కూలిపోయింది.
ప్రశాంతంగా ఉన్న ఒడిషాలో మత ఘర్షణలు చెలరేగాయి. స్థానికంగా వచ్చే నీరు కాస్తా ఎర్రగా మారడంతో బక్రీద్ సందర్భంగా గో హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నీట్ పరీక్షల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నాడు కేంద్రప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు పంపించింది.