Home / latest national news
గత ఏడాది అక్టోబర్ 7 తెల్లవారుఝామున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులకు తెగబడి సుమారు 1,200 మంది చంపి ... 250 మంది ఇజ్రాయెల్ పౌరులను తమ వెంట తీసుకువెళ్లారు. అటు నుంచి ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకారదాడులకు పాల్పడుతోంది
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్లోని చురు, హర్యానాలోని సిర్సాలో పగటి ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతను మించిపోయాయి. సరాసరి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటింది.
కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఈ నెల 31న అంటే శుక్రవారం జర్మనీ నుంచి బెంగళూరు చేరుకోనున్నారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే శుక్రవారం నాడు ఆయన బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనను అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర్ బుధవారం నాడు చెప్పారు.
ఒడిషా ముఖ్యమంత్రి బిజూ జనతాదళ్ (బీజేడీ) సుప్రీమో నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకరోజు ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఇవాళ 52.3 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు 49డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటి పోయాయి. అలాగే రాజస్థాన్ లోని చురు, హర్యానాలోని సిర్సాతో సహా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచాయి.
రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? గత కొంత కాలంగా రాజన్ కాంగ్రెస్లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. డిసెంబర్ 2022లో రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రలో రాజన్ రాహుల్తో కలిసి వెంట నడిచారు.
: ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఉన్నత న్యాయస్థానం తక్షణమే పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది. కాగా పిటిషన్ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు బదిలీ చేశారు.
మిజోరం రాజధాని ఐజ్వాల్లో కొండచరియలు విరిగి పడి సుమారు పది మంది మృతి చెందారు. జాతీయ రహదారి 6పై హంతూరు వద్ద రోడ్డుపై పెద్ద ఎత్తున బండ రాళ్లు పడ్డంతో జాతీయ రహదారి ధ్వంసం అయ్యింది.
దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అమాయకులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తోంది. ది ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేటర్ సెంటర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చూస్తే సుమారు 20,043 ట్రేడింగ్ స్కామ్లో జరిగాయి