Home / International News
ఇజ్రాయెల్ లో ప్రస్తుతం భీకర పరిస్థితులు నెలకొన్నాయి. వివాదాస్పద గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం తెల్లవారు జామున ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలెం, టెల్ అవివ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు.
ఆఫ్రికా లోని మొరాకోలో భారీ భూకంపం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న భారీ భూకంపంలో ఇప్పటి వరకు 820 మంది మృతి చెందగా.. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. వందల sది మంది గాయాలపాలయ్యారు. సెంట్రల్ మొరాకలో 6.8 తీవ్రతతో ఈ భూకంపం చోటు చేసుకుంది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ జోహన్నెస్బర్గ్లోని ఐదంతస్తుల భవనంలో అనుకోని రీతిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అత్యవసర సేవల
సరదా.. కేవలం సరదా కోసం యువకులు సాధారణంగా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళడం.. విహారయాత్రలు, పార్టీలు అంటూ చేసుకోవడం మనం గమనించవచ్చు. కానీ కేవలం సరదా కోసం 13 మందిని విచక్షణ రహితంగా కాల్చి చంపాడు ఓ యువకుడు. చదవడానికి ఆశ్చర్యంగా, భయానకంగా అనిపిస్తున్న ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది.
మెక్సికో దేశంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నాయారిట్ రాష్ట్రంలో రాజధాని టెపిక్కు కొద్ది దూరంలో ఉన్న బర్రాంకా బ్లాంకా ప్రాంతంలో రహదారి నుంచి బస్సు లోయలో పడిపోయింది. 40 మంది ప్రయాణికులతో టియువానా వైపు వెళుతున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి 164 అడుగుల లోతున్న లోయలో పడిపోయిందని అక్కడి అధికారులు తెలిపారు.
కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ కెన్యాలోని కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాగా రద్దీగా ఉండే జంక్షన్లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు.
జపాన్ రాజధాని టోక్యో లోని ఓ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టోక్యోలోని విమాశ్రయం రన్ వే పై రెండు కమర్షియల్ విమానాలు ప్రమాదవాశత్తూ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అదృష్టవశత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు.
భారత్ మరోసారి ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు వేదిక కానుంది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు దేశం ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ సుందరి 2023 పోటీలు రానున్న నవంబర్ లో దేశంలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎయిరిండియా విమానం రష్యాలో ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరిన విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా రష్యా కు మళ్లించారు. అక్కడ సురరక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటకు వెళ్లనున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 22 న ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు.