Two Matches Today in IPL 2025: నేడు ఐపీఎల్లో డబుల్ ధమాకా.. గెలిచేదెవరో!

KKR vs RR and Punjab Kings vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మేరకు వీకెండ్ సందర్భంగా ఆదివారం రెండు కీలక మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో భాగంగా.. ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకున్న రాజస్థాన్ రాయల్స్తో కోల్కతా నైట్రైడర్స్ తలపడనుంది.
తొలి మ్యాచ్ కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు కోల్కతా 10 మ్యాచ్లు ఆడగా.. 4 మ్యాచ్లు గెలుపొంది 5 మ్యాచ్ల్లో ఓడింది. మరో మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క పాయింట్ వచ్చింది. దీంతో పాయింట్ల పట్టికలో 9 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఇక, రాజస్థాన్ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడింది. ఇందులో 3 మ్యాచ్ల్లో గెలిచి 8 మ్యాచ్లో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో 8వ స్థానానికి పరిమితమైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకున్న రాజస్థాన్ ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
ఇక, ధర్మశాల వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తలపడనుంది. ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లు ఆడగా.. 6 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడింది. ఒక్క మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క పాయింట్ వచ్చింది. మొత్తం 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. అలాగే లక్నో జట్టు ఆడిన 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో గెలిచి మరో 5 మ్యాచ్ల్లో ఓడింది. దీంతో 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.