KKR Vs CSK: రాణించిన బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లు రాణించారు. రహానే (48), రస్సెల్ (38), మనీష్ పాండే (36) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసీ కోల్ కతా భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. రవీంద్ర జడేజా, కంబోజ్ కు ఒక్కో వికెట్ దక్కింది.
కాగా బ్యాటింగ్ కు వచ్చిన కోల్ కతా జట్టుకు రెండో ఓవర్లలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గుర్బాజ్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన నరైన్.. రహానేతో కలిసి స్కోర్ బోర్డ్ ముందుకు నడిపించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి 67 పరుగులు రాబాట్టారు. అనంతరం నరైన్ వెనుదిరగడంతో మనీష్ పాండేతో కలిసి రహానే పరుగులు రాబట్టారు. కానీ రహానే కూడా ఔట్ అవడంతో కోల్ కతా పరుగుల వేగం తగ్గింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన రస్సెల్ బౌండరీలతో రెచ్చిపోయాడు. చివర్లో రస్సెల్ అవుట్ కావడంతో కోల్ కతా భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. మనీష్ పాండే 28 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కాగా కోల్ కతా నిర్దేశించిన లక్ష్యాన్ని చెన్నై ఛేదిస్తోందో.. లేదో మరి.