Uttarakhand: హెలికాప్టర్ ప్రమాదం బాధాకరం: ప్రియాంకాగాంధీ!
Uttarakhand helicopter crash: ఉత్తరాఖండ్ గౌరీకుండ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మరణించారనే వార్త చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా సమీక్షించి, యాత్రికుల భద్రతకు, వారి ప్రాణాలకు భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి చేశారు.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. డెహ్రడూన్ నుంచి కేదార్ నాథ్ వెళ్తున్న హెలీక్యాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఏడుగురు చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. హెలీకాఫ్టర్ ప్రమాదంలో రాజ్వీర్ సింహ చౌహాన్, విక్రమ్ రావత్, వినోద్ దేవి, తృష్ణి సిన్హా , రాజ్కుమార్ సురేష్ జైసావ్ల, రుద్రరాజ్ కుమార్ జై సావ్ల, కాశి అనే రెండేళ్ల చిన్నారి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. హెలీకాఫ్టార్ గౌరీకుండ్ అడవుల్లో కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందరూ సజీవ దహనం అయ్యారు. ప్రతికూల వాతావరంణం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.