IPL 2025: ఉత్కంఠ పోరులో ముంబైపై గ్రాండ్ విక్టరీ.. అగ్రస్థానానికి గుజరాత్!

Gujarat Titans won by 3 wkts by DLS Method: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ముంబై వరుస విజయాలకు గుజరాత్ బ్రేక్ వేసింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో గుజరాత్ గెలుపొందింది. ఈ సీజన్లో 8 విజయాలతో గుజరాత్ అగ్రస్థానానికి ఎగబాకింది.
అంతకుముందు టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తొలి ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. ఓపెనర్ రికిల్టన్ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(7) ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 26 పరుగులకు 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
క్రీజులోకి వచ్చిన సూర్య(35). జాక్స్(53) కీలక ఇన్నింగ్స్ తో పరుగులు పెట్టించారు. సాయికిశోర్ బౌలింగ్లో సూర్య ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. తిలక్(7), హార్దిక్(1), నమన్ ధీర్(7) విఫలమయ్యారు. చివరిలో బోష్(27) రాణించడంతో ముంబై 150 పరుగుల మార్క్ చేరింది. గుజరాత్ బౌలర్లలో సాయికిశోర్ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్షద్, సిరాజ్, ప్రసిద్ధ్, కొయెట్జీ తలో వికెట్ తీశారు.
156 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్(5) బౌల్ట్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్(43). బట్లర్(30) నిలకడగా ఆడారు. అయితే మధ్యలో వర్షం అంతరాయం ఇబ్బంది కలిగించింది. ఈ సమయంలో ముంబై బౌలర్లు పరుగులు రాకుండా కట్టడి చేశారు. అశ్వని కుమార్ బౌలింగ్లో బట్లర్, బుమ్రా బౌలింగ్లో గిల్ ఔట్ అయ్యారు. ఇక, రూథర్ఫర్డ్(28), తెవాతియా(11), షారుఖ్(6), రషీద్(2), నమన్(12) పరుగులు చేశారు. అయితే వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 19 ఓవర్లు కుదించగా.. గుజరాత్ చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి రావడంతో 15 పరుగులు చేసి విజయం సాధించింది.