NEET PG 2025: ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలన్న సుప్రీం కోర్టు

NEET PG 2025: నీట్ పీజీ-2025 ప్రవేశ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్షను జూన్ 15న రెండు విడతల్లో నిర్వహించి, జులై 15న ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ప్రకటించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
పరీక్షను రెండు విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి మారి.. కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎన్ఈబీ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే దానిని ఒకేవిడతలో నిర్వహించేలా బోర్డ్ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎన్ఈబీ వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. జూన్ 15న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది.