Last Updated:

Madhya Pradesh: మద్యప్రదేశ్.. గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దీనిపైమాట్లాడుతూ, వ్యక్తి యొక్క చర్య హేయమైనది, ఖండించదగినది మరియు మానవత్వానికి అవమానం అని పేర్కొన్నారు

Madhya Pradesh: మద్యప్రదేశ్.. గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దీనిపైమాట్లాడుతూ, వ్యక్తి యొక్క చర్య హేయమైనది, ఖండించదగినది మరియు మానవత్వానికి అవమానం అని పేర్కొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కూడా ఈ చర్య సిగ్గుచేటని, ఖండించదగినదని, నిందితుల ఆస్తులను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

బుల్‌డోజర్ చేయాలి..(Madhya Pradesh)

నిందితుడిపై బుల్‌డోజర్ చర్య తీసుకోవాలనే కాంగ్రెస్ డిమాండ్ గురించి అడిగిన ప్రశ్నకు, కాంగ్రెస్ డిమాండ్ ఆధారంగా బుల్‌డోజర్ చర్య తీసుకోబడదు.అక్కడ ఒక ఆక్రమణ ఉన్నప్పుడే బుల్డోజర్ నడుస్తుందని అన్నారు. ఆక్రమణలు ఉన్నపుడు బుల్‌డోజర్లు నడుపుతామని చెప్పారు.నిందితుడిని ప్రవేశ్ శుక్లాగా గుర్తించి కేసు నమోదు చేసినట్లు మంగళవారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం,కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద చర్యలు కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఒక ట్వీట్‌లో సిధి జిల్లా నుండి ఒక వైరల్ వీడియో నా దృష్టికి వచ్చింది.నేరస్థుడిని అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని మరియు జాతీయ భద్రతా చట్టాన్ని కూడా అమలు చేయాలని నేను ప ఆదేశించాను అని అన్నారు. నిందితుడికి భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో సంబంధం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే బీజేపీ ఆ ఆరోపణలను ఖండించింది. తరువాత గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపించిన వ్యక్తికి చెందిన ఆస్తిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం కూల్చివేసింది.