Published On:

52 Covid Cases in India: విజృంభిస్తున్న కరోనా కేసులు.. 52 కోవిడ్ కేసుల్లో ఇద్దరు మృతి

52 Covid Cases in India: విజృంభిస్తున్న కరోనా కేసులు.. 52 కోవిడ్ కేసుల్లో ఇద్దరు మృతి

52 Covid Cases, 2 Deaths in Maharashtra: మహారాష్ట్రలో 52 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితులు స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. కాగా, జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్‌తో ఇద్దరు మృతి చెందినట్లు మహారాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఇందులో ఒకరికి హైపోకాల్సెమియా మూర్ఛ వ్యాధి ఉండగా.. మరొకరికి క్యాన్సర్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 

ఇదిలా ఉండగా, ఇప్పటివరకు 52 కేసులు యాక్టివ్ ఉన్నాయని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. అయితే అంతకుముందు కేరళలో 69 కేసులు నమోద్వవగా.. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు, కర్ణాటకలో 8, గుజరాత్‌లో 6, ఢిల్లీలో 3, హర్యానా, సిక్కిం, రాజస్థాన్‌లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు.