Home / Maharashtra
Woman Married 8 Men: ఓ లేడి ఎనిమిది మందిని వివాహం చేసుకుంది. భర్తలను బెదిరించి దోచుకున్నది. తాజాగా తొమ్మిదో వివాహానికి ఆమె ప్రయత్నిస్తున్నది. మాజీ భర్తల ఫిర్యాదు నేపథ్యంలో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన సమీరా ఫాతిమా ‘దోపిడీ దుల్హాన్’గా పేరుపొందింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నమోదైన ముస్లిం వర్గానికి చెందిన ధనవంతులు, వివాహిత పురుషులను లక్ష్యంగా చేసుకున్నది. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకున్నది. తన దీన పరిస్థితిని వివరించి వారి […]
Maharashtra Agriculture Minister Manikrao Kokate: మహారాష్ట్ర మంత్రి, ఎన్ సీపీ నేత మాణిక్ రావ్ కోకాటేపై వేటు పడింది. ఇటీవల అసెంబ్లీలో ఫోన్ లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన ఆయనకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వ్యవసాయ శాఖ నుంచి తప్పించింది. ఈ మేరకు అతడికి క్రీడలు, యువజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం క్రీడామంత్రిగా ఉన్న దత్తాత్రేయ భర్నేకు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి […]
Teacher Video Call With Student: మహిళ టీచర్ ఓ విద్యార్థిని లైంగికంగా వేధించింది. సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపింది. అర్ధనగ్నంగా విద్యార్థికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మహిళ ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఈ ఘటన జరిగింది. ఒక పాఠశాలకు చెందిన 35 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలు, విద్యార్థిని లైంగికంగా వేధించింది. కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో బాలుడికి అసభ్యకరమైన సందేశాలు […]
Raj Thackeray: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే 13 ఏళ్ల తర్వాత ఆదివారం మొదటిసారి ముంబయిలోని మాతోశ్రీలోకి అడుగుపెట్టారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు బాలాసాహెబ్ చిత్రం ముందు ఫొటో దిగారు. ‘తన అన్నయ్య శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా, దివంగత గౌరవనీయ బాలాసాహెబ్ ఠాక్రే నివాసం మాతోశ్రీని సందర్శించి, శుభాకాంక్షలు తెలియజేశానని ఎక్స్లో పేర్కొన్నారు. ఎంఎస్ఎస్ నేతలు […]
Manikrao Kokate: ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు ఓ రాష్ట్రానికి మంత్రి తన మొబైల్లో ఆన్లైన్ గేమ్లు ఆడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్రావ్ కోకెట్ అసెంబ్లీ సమావేశాల సమయంలో మొబైల్లో రమ్మీ ఆడుతున్నారని ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా దీనికి సంబంధించిన వీడియోలను పంచుకున్నారు. రైతులు, వ్యవసాయ సమస్యల గురించి సభలో చర్చలు […]
Maharashtra Govt. Removed Hindi Mandatory word: ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు హిందీ విధిగా బోధించాలని ఇటీవల మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. తాజాగా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తప్పనిసరి అనే పదాన్ని నోటిఫికేషన్ నుంచి తొలగించింది. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఆ రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో ‘తప్పనిసరి’ అనే పదాన్ని తొలగించింది. హిందీ భాషకు బదులు […]
Maharashtra: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 20కిపైగా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. ఇంద్రాయణి బ్రిడ్జ్ కూలిన ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రమాదం విషయం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న డివిజనల్ […]
Maharashtra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందేకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన విమానం గంటపాటు ఆలస్యమైంది. పైలట్ విమానం నడిపేందుకు నిరాకరించడమే ఇందుకు కారణం. ముఖ్యమంత్రి పర్యటన ఆలస్యం కావడం వల్ల పైలట్ విమానాన్ని నడిపేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే, మంత్రి గిరీశ్ మహాజన్, గులాబ్రావ్ పాటిల్ జలగావ్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. పర్యటనకు ఆయన రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చారు. అనంతరం తిరిగి ముంబయికి […]
Road Accident in Maharashtra : మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఘటన లాతూర్-సోలాపూర్ హైవేపై గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుల్జాపూర్-లాతూర్ మార్గంలోని ఆశివ్ ఫాటా సమీపంలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. పూణె నుంచి లాతూర్కు టూరిస్ట్ బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో అదేమార్గంలో వెళ్తున్న బస్సును వెనుక […]
52 Covid Cases, 2 Deaths in Maharashtra: మహారాష్ట్రలో 52 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితులు స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. కాగా, జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్తో ఇద్దరు మృతి చెందినట్లు మహారాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఇందులో ఒకరికి హైపోకాల్సెమియా మూర్ఛ వ్యాధి ఉండగా.. మరొకరికి క్యాన్సర్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, […]