Published On:

Honeymoon Murder : భర్త హత్య కేసులో నా ప్రమేయం ఉంది : నేరాన్ని అంగీకరించిన సోనమ్‌

Honeymoon Murder : భర్త హత్య కేసులో నా ప్రమేయం ఉంది : నేరాన్ని అంగీకరించిన సోనమ్‌

Honeymoon Murder in Meghalaya : మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో నిందితురాలు సోనమ్‌ రఘువంశీ తన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తన భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. విషయాన్ని సిట్‌ వర్గాలు వెల్లడించాయి.

 

కేసులో సోనమ్‌‌తోపాటు ఇతర నిందితులను బుధవారం షిల్లాంగ్‌ తీసుకువచ్చారు. సిట్‌ బృందం వీరిని కేసు గురించి ప్రశ్నించింది. ఈ క్రమంలో సోనమ్‌ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ ఎదుట రికార్డు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వాంగ్మూలాన్ని వీడియోటేప్‌ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తునకు ఆమె వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఈ రోజు నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నారు.

 

సోనమ్‌‌ను ఉరితీయాలి :  సోదరుడు గోవింద్
మరోవైపు హత్య కేసుపై సోనమ్‌ సోదరుడు గోవింద్‌ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఉన్న ఆధారాలు చూస్తుంటేఆమెనే హత్యకు పాల్పడినట్లు అర్థమవుతోందన్నారు. కేసులో ఉన్న నిందితులు రాజ్‌ కుశ్వాహాకు తెలిసినవాళ్లేనని చెప్పారు. వార్త తెలిసిన తర్వాత తాము సోనమ్‌తో సంబంధాలు తెంచుకున్నామని వివరించారు. రాజా రఘువంశీ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. కేసులో సోనమ్‌ దోషిగా తేలితే ఉరితీయాలన్నారు.

 

రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది. మే 11వ తేదీన అతడికి సోనమ్‌తో పెళ్లి జరిగింది. 20వ తేదీన హనీమూన్‌ కోసం మేఘాలయకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా అనుమానించారు. అనంతరం సోనమ్‌ కోసం గాలించగా, ఆమె గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఇవి కూడా చదవండి: