Published On:

India Pakistan War: పాక్ ను పడగొట్టడంలో ఇస్రోది కీలకపాత్ర!

India Pakistan War: పాక్ ను పడగొట్టడంలో ఇస్రోది కీలకపాత్ర!

ISRO played Key Role in Operation Sondoor 2.0: పాకిస్తాన్ ను కట్టడి చేయడంలో భారత ఉపగ్రహాలు ఎంతో సహాయం చేశాయి. ఒకరకంగా శ్రీహరికోట పాకిస్తాన్ ఆటలు సాగనివ్వలేదు. ఇస్రో (ISRO) దెబ్బకు పాకిస్తాన్ తోకముడిచింది. పాకిస్తాన్ కదలికలను మన శాటిలైట్స్ ఖచ్చితమైన పలితాలను చేరవేశాయి. శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగానే పాకిస్తాన్‌లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ గుర్తించారు. భారత్ మిస్సైల్స్ కచ్చితత్వ లక్ష్యాలను చేరుకోవడంలో రాడార్, శాటిలైట్ వ్యవస్థ కీలకపాత్ర పోషించింది. 7500 కిలోమీటర్ల తీర ప్రాంతంపై 10 శాటిలైట్లు నిఘా పెట్టాయి. పాకిస్తాన్ చర్యలను గుర్తించి వెంటనే సాయుధ దళాలకు సమాచారం అందించారు. ఇస్రో పాత్రను ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ సంతోషం వ్యక్తం చేశారు.

 

 

ఇండియా -పాకిస్తాన్‌ల మధ్య శనివారం కుదిరిన కాల్పుల ఒప్పందం గురించి యావత్‌ ప్రపంచం ముందు పాకిస్తాన్‌ నవ్వుల పాలయ్యింది. కాల్పుల ఒప్పందానికి అంగీకరించి.. వెంటనే గండికొట్టడం పాకిస్తాన్‌కే చెల్లింది. పాకిస్తాన్‌ను ప్రపంచంలోని ఏ దేశం నమ్మడం లేదు. ఇటీవల పాక్‌ అసెంబ్లీలో ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. ఈ యుద్ధంలో ముస్లిం దేశాలు కూడా మనకు మద్దతు ఇవ్వడం లేదు. ప్రపంచంలోని ఏ దేశం మనల్ని నమ్మడం లేదని వాపోయాడు. కేవలం ఒక్క తుర్కీ మాత్రం ఆపదలో ఆపన్నహస్తం అందిస్తోందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచదేశాల ముందు పాకిస్తాన్‌ విలువ ఏ పాటిదో తేలికగా అర్ధం చేసుకోవచ్చు.

 

 

పాకిస్తాన్ ది ఎప్పుడూ వంకర బుద్ధే. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ చరిత్ర పాకిస్తాన్ కు లేదు. ఒకవైపు కాల్పుల విరమణ అంటూ ఉంటుంది. మరోవైపు సదరు ఒప్పందాలను సిగ్గూ శరం లేకుండా ఉల్లంఘిస్తుంది.ఈసారి కూడా అదే జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ , పాకిస్తాన్ సైనిక ఘర్షణలకు సంబంధించి కాల్పుల విరమణ ప్రకటించాడు. దీనికి భారత్ కట్టుబడి ఉంది. అయితే పాకిస్తాన్ ఎప్పటిలాగే ఉల్లంఘించింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో తాజాగా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలు తరువాత సంభవించిన అనేక పరిణామాలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి: