India Pakistan War shut Down: అవును యుద్ధం ముగిసింది.. భారత్ కీలక ప్రకటన!

India Pakistan War Shu Down Confirms by External Affairs secretary Vikram Misri: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. దాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. దాడుల్లో 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు.
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ భారత్ పైకి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు దిగింది. అందుకు భారత్ గట్టిగా బదులిచ్చింది. మరోవైపు భారత్ కూడా పాకిస్తాన్ లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడి వాటిని నేలమట్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్, పాకిస్తాన్ మధ్య అమెరికా జరిపిన శాంతి చర్చలు ఫలించాయి. దీంతో ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అయితే ట్రంప్ చేసిన ప్రకటన నిజమేనని భారత్ తెలిపింది. ఇండియా- పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు. కాల్పుల విరమణపై మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంఓకి పాకిస్తాన్ కు చెందిన డీజీఎంఓ కాల్పుల విరమణపై ఫోన్ చేశారని చెప్పారు.
కాగా సోమవారం తదుపరి చర్చలు జరుగుతాయని మిస్రీ చెప్పారు. ఇరు దేశాల మిలటరీ జనరల్స్ మిగిలిన అంశాలపై చర్చిస్తారని అన్నారు. కాగా.. కాల్పుల విరమణకు తక్షణమే ఒప్పుకుంటున్నట్టు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ధ్రువీకరించారు.