Last Updated:

Maharashtra: మహారాష్ట్రలో విఠల్ స్వామి భక్తులు,పోలీసుల మధ్య తోపులాట.. ప్రతిపక్షాల విమర్శలను ఖండించిన ప్రభుత్వం

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో వార్కారీలు (విఠల్ స్వామి భక్తులు) మరియు పోలీసుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తులపై పోలీసులు లాఠీచార్జి జరిపారంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా ప్రభుత్వం మాత్రం దీనిని ఖండించింది.

Maharashtra: మహారాష్ట్రలో విఠల్ స్వామి భక్తులు,పోలీసుల మధ్య తోపులాట.. ప్రతిపక్షాల విమర్శలను ఖండించిన ప్రభుత్వం

Maharashtra: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో వార్కారీలు (విఠల్ స్వామి భక్తులు) మరియు పోలీసుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తులపై పోలీసులు లాఠీచార్జి జరిపారంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా ప్రభుత్వం మాత్రం దీనిని ఖండించింది.

హోం మంత్రి రాజీనామా చేయాలి..(Maharashtra)

పూణేలోని అలండి పట్టణంలోని సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ సమాధి మందిర్‌లోకి ప్రవేశించడానికి విఠల్ స్వామి భక్తులు పెనుగులాడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.పోలీసులు ఒకేసారి 75 మంది భక్తులను పంపుతున్నారు, అయితే, కొంతమంది వ్యక్తులు బారికేడ్లను బద్దలు కొట్టి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీనితో వారిని పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తపరిస్దితి ఏర్పడింది. దీనిపై శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ హిందుత్వ ప్రభుత్వ వేషాలు బట్టబయలు అయ్యాయి. మొగలులు మహారాష్ట్రలో పునర్జన్మ పొందారంటూ విమర్శించారు. భక్తులపై లాఠీచార్జి చేయడం తప్పని దీనిపై మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలంటూ ఎన్సీపీ నేతలు డిమాండ్ చేసారు.

పరిమితికి మించి వెళ్లడానికి ప్రయత్నం..

దీనిపై దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ వార్కారీ సంఘంపై ఎలాంటి లాఠీ ఛార్జి జరగలేదని పేర్కొన్నారు. మేము అదే స్థలంలో గత సంవత్సరం తొక్కిసలాట వంటి పరిస్థితుల నుండి నేర్చుకున్నాము. తీర్థయాత్రలో పాల్గొనే ప్రతి బృందానికి 75 పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించామని ఫడ్నవీస్ చెప్పారు. దాదాపు 400-500 మంది యువకులు పాదయాత్రలో పాల్గొనేందుకు మొండిగా ఉన్నారని, ప్రవేశ పాస్‌ల పరిమిత కేటాయింపుపై నిర్ణయాన్ని అనుసరించడానికి సిద్ధంగా లేరని ఆయన తెలియజేశారు. వారు బారికేడ్లను బద్దలు కొట్టారు. పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో కొంతమంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఫడ్నవీస్ చెప్పారు.