IIT JEE Advance 2025 Results: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండిలా..!

IIT JEE Advanced 2025 results Released: జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. మే 18న జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష పలితాలను ఐఐటీ కాన్పుర్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1.80 లక్షలమంది హాజరవ్వగా.. తెలుగు రాష్ట్రాల నుంచి 40వేల మంది రాసినట్లు అంచనా వేశారు. ఫలితాల కోసం https://results25.jeeadv.ac.in/ క్లిక్ చేసి చూసుకోవచ్చు.