Published On:

Tragedy: ముంబైలో దారుణం.. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు మృతి

Tragedy: ముంబైలో దారుణం.. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు మృతి

Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది. ముంబ్రా రైల్వేస్టేషన్ లో లోకల్ ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడి ఐదుగురు మృతి చెందారు. అసలే ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నేడు సోమవారం పనిదినం కావడంతో ప్రయాణికులు భారీగా ఎక్కారు. దీంతో ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు పదుల సంఖ్యలో పట్టు కోల్పోయి రైలు పట్టాలపై పడిపోయారు. ఘటన జరిగిన సమయంలో రైలు వేగంగా వెళ్తుండటంతో ఐదుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం రైల్వే ఆస్పత్రికి తరలించారు.

కాగా ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రైలులో అధికర రద్దీ ఉండటం వల్లనే ఈ ఘటన జరిగిందని నిర్ధారించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుల వివరాలు తెలియరాలేదు. ఘటనలో రైల్వేశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచాలని ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.