Published On:

18 Died due to Heavy Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు.. 18 మంది మృతి!

18 Died due to Heavy Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు.. 18 మంది మృతి!

18 Died due to Heavy Rains in Maharashtra: మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటివరకు 18 మంది మరణించారు. 65 మంది గాయపడ్డారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాలు, పిడుగుపాటు, వరదల కారణంగా పలువురు చనిపోయినట్టు వివరించింది. మరోవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని.. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

 

మరోవైపు రాజధాని ముంబై నగరంతోపాటు రత్నగిరి, సిందుదుర్గ్, రాయ్ గఢ్ తదితర జిల్లాల్లో భారీగా వర్షం కురిసిందని తెలిపింది. మరోవైపు పశ్చిమ మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పూణె, కొల్హాపూర్ , సతారాతో పాటు రాయ్ గఢ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ముంబైలో రహదారులు నీట మునగడంతో వాహనాలు, లోకల్ ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.