India Covid-19 Cases: భారత్ లో విజృంభిస్తున్న కరోనా.. 1000 దాటిన కేసులు!

Covid-19 Cases in India: భారత్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొద్దిరోజుల క్రితం విదేశాల్లో నమోదైన కరోనా కేసులు తాజాగా మన దేశంలోనూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 క్రమంగా విస్తరిస్తోంది. కాగా దేశంలో కొత్త వేరియంట్ తో కొవిడ్ యాక్టీవ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు తాజాగా కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో ఏడుగురు మరణించినట్టు కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ, పరిశుభ్రంగా ఉండాలని తెలిపింది.
ప్రస్తుతం భారత్ లో 1009 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 400 పైగా కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఢిల్లీ 109, యూపీ 15, మహారాష్ట్ర 209, గుజరాత్ 83, తమిళనాడు 69, కర్నాటక 47, రాజస్థాన్ 13, పశ్చిమ బెంగాల్ 12, పుదుచ్చేరి 9, హర్యానా 9, ఏపీ 4, మధ్యప్రదేశ్ 2, ఛత్తీస్ గఢ్, గోవా, తెలంగాణలో ఒక్కో కేసు చొప్పున యాక్టీవ్ కేసులు బయటపడుతున్నాయి. వైరస్ వ్యాప్తికి ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు బయటపతున్నాయి.