Encounter in Chhattisgarh: ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

1 Maoist Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లోని వరుసగా ఎదురుకాల్పులు కొనసాగుతోన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోలు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా బలగాల మీదకు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతోన్నాయి. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఎన్కౌంటర్ను జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోలు మృతిచెందిన విషయం తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. నంబాల కేశవరావుపై రూ.కోటిన్నర రివార్డు ఉన్న విషయం తెలిసిందే.