2 Months kid killed in Siddipet: సిద్దిపేటలో దారుణం.. 2 నెలల పసికందును చంపి బావిలో పడేసిన తల్లి!

2 months old son Killed by her Mother in Siddipet: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తల్లి తన 2 నెలల పసికందును చంపి బావిలో పడేసిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. అప్పన్నపల్లిలో శ్రీమాన్, కవిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ 2 నెలల క్రితం మగబిడ్డ జన్మించాడు. ఈ నెల17న భర్త శ్రీమాన్ పని నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయాడు. ఈ సమయంలో ఒంటరిగా ఉంటున్న కవిత వద్దకు ఇద్దరు వచ్చి మాయమాటలు చెప్పారని, ఆ ఇద్దరు బైక్పై వచ్చి బాబు ఎత్తుకెళ్లారని భర్తతో కలిసి దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా తల్లి కవితపై పోలీసులకు అనుమానం కలిగింది. చివరికీ అదే నిజమని తేలింది. పోలీసుకు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెల్లడించింది. గ్రామస్తుల ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతో తల్లి కవిత తన 2 నెలల బాబును బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.