Home / Police
యూట్యూబ్ చందు గాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనితో సాయి కిరణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో వార్కారీలు (విఠల్ స్వామి భక్తులు) మరియు పోలీసుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తులపై పోలీసులు లాఠీచార్జి జరిపారంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా ప్రభుత్వం మాత్రం దీనిని ఖండించింది.
ఉత్తరప్రదేశ్ పోలీసులు గ్రేటర్ నోయిడాలోని మూడంతస్తుల ఇంటిలో విదేశీయులు ఏర్పాటు చేసిన డ్రగ్స్ తయారీ ల్యాబొరేటరీని ఛేదించారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి 46 కిలోల డ్రగ్ను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం పోలీసులు తెలిపారు.
అయోధ్యలో 28 ఏళ్ల ఆలయ పూజారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. స్దానిక నరసింహ ఆలయ పూజారి రామ్ శంకర్ దాస్ తన ఆత్మహత్యాయత్నాన్ని ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పోలీసుల వేధింపుల వల్లే తానుఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో విషయంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేయడం లేదని.. ఈ క్రమంలో సిట్ కార్యాలయాన్ని ముట్టడించాలని వైఎస్సార్ టీపీ భావించింది.
37 రోజుల పాటు పంజాబ్ పోలీసుల నుండి తప్పించుకున్న తర్వాత, వేర్పాటువాద మరియు రాడికల్ బోధకుడు అమృత్ పాల్ సింగ్ చివరకు పంజాబ్లోని మోగాలోని గురుద్వారాలో లొంగిపోయాడు. అసోంలోని దిబ్రూగఢ్లోని సెంట్రల్ జైలుకు ఆయన్ను తరలిస్తున్నారు.
మెక్సికోలో ఆగంతుకులు చెలరేగిపోయారు. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 18మంది మృతిచెందారు. ఘటనలో మేయర్ తో సహా పోలీసులు కూడా మరణించారు. దీంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
గడప, గడపకు కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి చిత్తూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓట్లు వేసి గెలిపిస్తే, బయట వ్యక్తులతో మాపై దాడులు చేయిస్తున్నారని స్థానికులు ఆయన్ను నిలదీశారు
ఒక రాజధాని-అది అమరావతిగా పేర్కొంటూ అమరావతి రాజధానుల రైతుల తలపెట్టిన మహా పాద యాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అమరావతి టు అరసవళ్లి పేరుతో తలపెట్టిన పాదయాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర రైతులకు సాదర స్వాగతాలతో స్థానికులు, నీరాజనాలు పలికారు
ఓకే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఓ మహిళా సీఐతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. దీనిని గుర్తించి మహిళా సిఐ భర్త ఓ రోజు వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కాగా వీరి తీరుపై సుబేదారి పోలీస్ స్టేషన్లో అతను ఫిర్యాదు చేశారు. ఈ ఇరువురి సీఐల వ్యవహారం వరంగల్ జిల్లాలో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.