Published On:

Telangana: సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కిన ఐఏఎస్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎస్

Telangana: సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కిన ఐఏఎస్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎస్

Telangana CS Ramakrishna Rao Strong Warning to IAS Officers for Political Issue: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పర్యటనలో భాగంగా నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సీఎంకు పలువురు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అయితే ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లను   ఐఏఎస్ అధికారి శరత్ మొక్కారు. కాగా, సీఎం రేవంత్ హడావిడిగా ఉండడంతో సరిగ్గా చూడలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత తీవ్ర చర్చకు దారి తీసింది.

 

తాజాగా, ఈ వ్యవహారంపై సీఎస్ సీరియస్ అయింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణా రావు ఐఏఎస్‌లకు వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకులతో ఉన్న సమయంలో ఐఏఎస్‌లు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. కొంతమంది అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.

 

భవిష్యత్తులో ఐఏఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని, ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్ఠను కాపాడాలని చెప్పారు. రాజకీయ నేతలతో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ హెచ్చరించారు. కాగా, ఈ విషయంపై ప్రతిపక్షాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.